AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కాం: అంతర్జాతీయ స్థాయిలో వైసీపీ అవినీతి – సోమిరెడ్డి

AP Liquor Scam Reaches International Levels, Alleges TDP's Somireddy

AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కాం: అంతర్జాతీయ స్థాయిలో వైసీపీ అవినీతి – సోమిరెడ్డి:ఏపీలో జరిగిన లిక్కర్ స్కాం అంతర్జాతీయ స్థాయికి చేరుకుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన వారిపై ప్రధాని మోదీ తీసుకున్న చర్యల తరహాలోనే, ఆర్థిక ఉగ్రవాదులపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు.

ఏపీ లిక్కర్ స్కాంపై విచారణకు సోమిరెడ్డి డిమాండ్

ఏపీలో జరిగిన లిక్కర్ స్కాం అంతర్జాతీయ స్థాయికి చేరుకుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన వారిపై ప్రధాని మోదీ తీసుకున్న చర్యల తరహాలోనే, ఆర్థిక ఉగ్రవాదులపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు.

ఈడీ అధికారులు చిన్న కేసులపై దృష్టి సారిస్తున్నారని, అయితే ఏపీ లిక్కర్ స్కాం ఎంతో మంది పేదల ప్రాణాలను బలిగొందని సోమిరెడ్డి గుర్తు చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం, కాళేశ్వరం ప్రాజెక్టులపై ఈడీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో, ఏపీలో జరిగిన భారీ లిక్కర్ స్కాంపై కూడా ఈడీ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 30 వేల మంది ప్రాణాలను బాలగొన్న ఏపీ మద్యం స్కాంపై విచారణ జరగాలని ఆయన కోరారు.

ఈ కేసులో వైసీపీ నేతల అవినీతి దేశ సరిహద్దులు దాటిందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఈ స్కాంను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వైసీపీ నేతలకు గోల్డ్ మెడల్స్ ఇవ్వాలని ఆయన వ్యంగ్యంగా అన్నారు. రూ. 50 కోట్లతో కుక్కపిల్లను కొన్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అది నకిలీదని తెలియకపోయినా ఈడీ వెంటనే స్పందించింది. అదే విధంగా, ఏపీ మద్యం స్కాంపై కూడా విచారణ జరపాలని ఆయన కోరారు.

Read also:Movie News : రాముడిగా రణ్‌బీర్, సీతగా సాయిపల్లవి ఎంపిక – సహజత్వానికి ప్రాధాన్యం

 

Related posts

Leave a Comment